NLR: ఏఎస్ పేట సమీపంలో ఎన్ఫోర్స్మెంట్, రవాణా శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి ASపేటకు వస్తున్న కావేరీ బస్సును అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎమర్జెన్సీ డోర్ సైతం లేకపోవడంతో ఆత్మకూరు ఎంవీఐ ఎం.రాములు బస్సును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.