MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు భూనిర్వాసితులు సోమవారం ఎంపీ రఘునందన్ రావును ఆయన నివాసంలో కలిశారు. మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.19 కోట్లు నిధులు కేటాయించడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. మార్కెట్ ధరతో సమానంగా తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.