KMR: వరి ధాన్యం నూర్పిడి చేసిన వరి కల్లాలు తరలించి నెలరోజులు గడుస్తున్నా కాంటా చేయడంలో అధికారులు, నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి మాచారెడ్డి మండలంలో వరి నూర్పుళ్ళు వేగంగా జరిగాయి. ధాన్యం కల్లాలకు తరలించి ఆరబెట్టి కుప్పలు చేసుకొని కాంటా కోసం ఎదురుచూస్తున్నారు.