MNCL: అడవులు, వన్యప్రాణులతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని తాళ్లపేట FRO సుష్మారావు అన్నారు. బర్ద్ వాచ్ కార్యక్రమంలో భాగంగా జన్నారం మండలంలోని తపాలాపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం మండలంలోని గోండుగూడా గేటు ద్వారా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని, వాటిని కాపాడేందుకు కృషి చేయాలన్నారు.