NZB: భీంగల్ మండలం ముచ్కూర్ పెద్దగుట్టపై వందల ఏళ్ల నాటి నర్సింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దారి మూసుకుపోయిన ఈ ప్రాచీన ఆలయాన్ని తెరిపించేందుకు గ్రామస్తులు, వేద పండితులు తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో స్వామివారి తొలి అవతారమైన వరాహ స్వామి విగ్రహం బయటపడింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.