MBMR: పాలమూరు యూనివర్సిటీ మహిళా క్రాస్ కంట్రీ జట్టు AIU యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనడానికి మంగళూరు యూనివర్సిటీకి బయలుదేరింది. ఈ పోటీలు ఫిబ్రవరి 26-28 వరకు జరుగనున్నాయి. ఉపకులపతి ప్రో జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారిణులకు ట్రాక్ షూట్లు, యూనిఫామ్లు అందజేసి జాతీయ స్థాయిలో రాణించి యూనివర్సిటీకి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.