తిరుపతి జిల్లా తాళ్లపాకలోని పెద్ద గంగమ్మ ఆలయంలో అమావాస్య పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, సాయంత్రం 7 గంటలకు కన్నుల పండువగా ఊంజల సేవ నిర్వహించారు. ఆలయ ఛైర్మన్, కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక శోభతో తాళ్లపాక పరిసరాలు సందడిగా మారాయి.