NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి వస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. బహిరంగ సభల్లో కూడా నాయకులు ఆమెకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు. అన్యూహంగా పార్టీ అధిష్టానం ప్రశాంతి రెడ్డిని పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. దీంతో ఎమ్మెల్యేకు ఇక మంత్రి పదవి లేనట్టే అని ప్రచారం సాగుతోంది.