ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఇవాళ ఎస్పీ ప్రతాప్ కిషోర్ పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేరాల నియంత్రణ, ప్రజా భద్రత, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిర్మూలనపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల ఫిర్యాదులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు.