KMM: రఘునాధపాలెం మండలం మంచుకొండ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం మంచుకొండ-పంగిడి దారిలోని ఒక తోటలో దాడులు నిర్వహించి రూ.3వేల నగదుతో పాటు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారవ్వగా మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.