KMR: ఈ నెల 23న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకుని దేవునిపల్లిలో మంగళవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాలయం నుంచి దత్తాత్రేయ ఆలయం వరకు సాగిన ఈ ర్యాలీని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్ వినోద పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. హిందూ కుటుంబాలన్నీ ఐక్యంగా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.