BHPL: చిట్యాల(M)కేంద్రంలోని శివాజీ చౌక్ పోస్ట్ వద్ద ఇవాళ పోలీసులు, సీసీఎస్ బృందం సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నర్సింగరావు (57), మధుకర్ (43) అక్రమంగా తరలిస్తున్న 1.3 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు CI మల్లేష్ పేర్కొన్నారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.