KMR: కామారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు నిర్వహించకూడదని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన DRA కమిటీ సమావేశం జరిగింది. DM&HO రవీందర్ గౌడ్ సమావేశంలో నివేదిక సమర్పించారు. సరైన పత్రాలు సమర్పించని 11 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.