NLG: ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, బోనస్ కలిపి రూ.19,800 కోట్లు చెల్లించినట్లు కోదాడలో వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.