ASF: రెబ్బెన మండలం తక్కల్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగ్గ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, 80 బ్యాగుల్లో ఉన్న సబ్సిడీ బియ్యం పట్టుబడినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. వీటిని అక్రమంగా నిల్వ ఉంచిన గజ్జెల నారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.