NDL: నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పత్తికొండలో CITU ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ.. 17న నంద్యాలలో భారీ బహిరంగ సభ, ర్యాలీ ఉంటుందని, ఈ మహాసభల్లో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విభజన పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ ఇవ్వాలన్నారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.