MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన 87 మంది లబ్ధిదారులకు రూ.43,50,000 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.