BHNG: మోత్కూర్ ఆరో వార్డు ఆరెగూడెంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనసే పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించారు.