MBNR: ఎందరికో స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిబాపూలే అని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమ సమాజంలో అందరూ చక్కగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు.