BHNG: యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసాను పొందేందుకు అర్హులైన రైతులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని AO శైలజ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 28, 2026 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్బుక్ పొంది, డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయిన రైతులు, గతంలో ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు రైతు భరోసా రాకున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినయోగం చేసుకోవాలన్నారు.