MBNR: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఛైర్మన్ విశారదన్ మహారాజ్ కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం డీజీపీ శివధర్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. 4 రోజులుగా ధర్నా కొనసాగిస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విధి నిర్వహణ విఫలమైన పోలీసులను సస్పెండ్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.