MNCL: పాత గోడ కూలి వ్యక్తి గాయపడిన సంఘటన లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లిలో జరిగిందని 108 టెక్నీషియన్ మునిందర్ గౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన నాయనాల రాజయ్య బుధవారం పశువుల కొట్టం ప్రహరీ గోడ వద్ద పనిచేస్తుండగా గోడ కూలిపోయింది. దీంతో రాజయ్య కాలుకు తీవ్ర గాయమైంది.108 సిబ్బంది టెక్నిషియన్ మునిందర్ గౌడ్, పైలట్ శ్రీనివాస్ చేరుకుని ఆస్పత్రికి తరలించారు.