NRML: పెంబి మండలంలోని మందపల్లి శివారులో ఎంపీ ఎస్సై హనుమాన్లు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనదారుడు సరైన అనుమతి పత్రాలు అన్ని సవ్యంగా ఉంచుకుని, హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వ్యక్తిని శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ఇదే విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.