KRNL: ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిప్రా అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై వివరాల మేరకు.. బెంగళూరు నగరానికి చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి బయలుదేరారు. ఆదోని శివారులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు.