NZB: జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జే. గంగాదాస్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాధాకృష్ణ పాఠశాల, ఆర్యసమాజ్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అనిత, సునీత, ఫార్మాసిస్ట్లు పురుషోత్తం, ఉమాప్రసాద్, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.