HYD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా HYDలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపుతో పాటు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.