KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై గత కేసిఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి మాట్లాడారు. ప్రజల తిరుగుబాటు చూసి ఆనాడు కేసీఆర్ వెనుకడుగు వేశారని, కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇళ్లు కూల్చడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.