KMR: మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా-పత్తి మిల్లులకు వెళ్లే రోడ్డు చాలా ఏండ్లుగా అధ్వానంగా ఉన్న విషయం తెలిసిందే. వార్షాకాలం వచ్చిందంటే ఈ మార్గాన వెళ్లాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రస్తుతం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో శనివారం ఎట్టకేలకు రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయని సర్పంచ్ సంతోష్ తెలిపారు.