KRNL: రాయలసీమ యూనివర్సిటీ మహిళా ఖో-ఖో జట్టు కర్ణాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 5 వరకు జరిగే అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా ఇవాళ యూనివర్సిటీ ప్రాంగణంలో మహిళా జట్టుకు ఉపకులపతి వెంకట బసవరావు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.