KKD: రౌతులపూడి సామాజిక ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం జ్వరం, కడుపునొప్పి లక్షణాలతో 11 మంది చేరారు. కలుషిత ఆహారం తీసుకోవడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులు ఉప్పంపాలెం శివారులోని క్రషర్లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నట్లు వలస కార్మికులు తెలిపారు.