ASR: ముంచంగిపుట్టులోని జర్రెలలో రూ.1.40 కోట్లతో జర్రెల-మండిభ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.