NLG: ఎమ్మెల్యే బాలునాయక్ ఇవాళ దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చింతపల్లి వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కొండమల్లేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మౌలిక వసతుల సమస్యలపై ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.