CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాలలోనూ విజయం సాధించాలని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సూచించారు. కుప్పం మండలం మోట్లచేను పంచాయతీ టీడీపీ సమన్వయ సమావేశం గురువారం ఆయన నిర్వహించారు. విజయం కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.