KDP: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె సుందరయ్య కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం పంచాయతీ కార్యదర్శి నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. భూపోరాటం ద్వారా నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.