PPM: పదవ తరగతి మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి మార్కు విద్యార్థి భవిష్యత్తుకు కీలకమని, కోడింగ్-డీకోడింగ్ ప్రక్రియలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్వతీపురంలో నిర్వహిస్తున్న మూల్యాంకన ప్రక్రియను సందర్శించారు.