MDK: చేగుంట మండలం జైత్రంతాండాలో విద్యుత్ సమస్యలు ఇబ్బందిగా తయారయ్యాయని సర్పంచ్ ధరావత్ సుభాష్ నాయక్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని గురువారం జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) నారాయణ నాయక్ ను కలిసినట్లు వివరించారు. తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.