MNCL: బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన పాన్ షాప్ యజమాని కొట్టే సత్య ప్రకాశ్ (68) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. LV ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది సత్య ప్రకాశ్ కళ్లను సేకరించారు. శోకసంద్రంలోనూ నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన ఆ కుటుంబాన్ని స్థానికులు అభినందించారు.