KMR: ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు మాసానిపల్లిలో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ సునంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సావిత్రి, యేచవ్వలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.