MDK: సదాశివపేట మండలం సిద్ధాపూర్లో సందీప్ కుమార్ (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇంటికి వెళ్లి కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన సందీప్,ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసినారు.