NGKL: జిల్లా కేంద్రంలో 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదే వార్డ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, కౌన్సిలర్స్ ఉన్నారు.