ప్రకాశం: ముండ్లమూరు మండలం పరిధిలోని రాజానగరం మేజర్ నుంచి సింగనపాలెం మైనర్ వరకు సాగర్ జలాలు పూర్తిగా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట పైరుకంకి, పొట్ట దశలో ఉండగా ఈ సమయంలో నీరు అత్యవసరం అంటున్నారు. రెండు రోజులుగా నీరు రాకపోవడంతో ఎకరాకు రూ.30-40 వేల పెట్టుబడి ప్రమాదంలో పడిందని వాపోతున్నారు.