KRNL: ఆదోని పట్టణంలోని శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాలలో నిన్న పాఠశాల పెచ్చులూడీ బాలుడు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై SFI నాయకులు గౌస్, జగన్, ఉమాకాంత్ జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ను ఇవాళ కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, విద్యార్థుల వైద్య ఖర్చులను యాజమాన్యం భరించాలని అన్నారు.