PLD: సత్తెనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరూ ప్రమాదవశాత్తు కింద పడిపోగా వారిపై నుంచి టిప్పర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.