MNCL: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారానికై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సింగరేణి జాతా’ ముగిసింది. ఈ సందర్భంగా సోమవారం కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన ధర్నాలో శ్రీరాంపూర్ ఏరియా నాయకులు పాల్గొన్నారు. మెడికల్ బోర్డును పాత విధానంలో కొనసాగించాలని, స్ట్రక్చర్ కమిటీ నిర్ణయాలు, సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.