జనగామ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా దృక్పథం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.