MDK: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. బుధవారం చేగుంట మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.