MDK: నిజాంపేట పరిధిలోని తిప్పనగుల్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం విక్రయించే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రైతులకు సూచించారు.