SDPT: కలెక్టరేట్లో శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ హైమావతి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, రైతులకు అండగా ఉండేలా ‘భూభారతి’ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. యాజమాన్యాలకు నమ్మకం కలిగేలా సర్వేయర్లు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకమన్నరు.