KMR: నాగిరెడ్డి పెట్ మండలంలోని మెల్లకుంట తండా గ్రామంలో కల్యాణలక్ష్మి పథకం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రామావత్ బాల్యనాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రామావత్ వాసురం ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రామావత్ కవితకు మంజూరైన చెక్కును అందజేశారు.