BDK: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుంజా ధర్మారావు ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ప్రజా వేదికలో ప్రకాష్ రాజ్ శ్రీరాముడు ఉత్తర భారతీయుడని, రామ-లక్ష్మణ-సీతలు లంకలో పండ్లు దొంగతనం చేయడం వలన యుద్ధం జరిగిందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఫిర్యాదులో పేర్కొన్నారు.